తిరువనంతపురం: కేరళలో త్వరలో సత్యసాయిబాబా ఆలయాన్ని నిర్మించనున్నారు. థొనక్కల్లోని సాయి గ్రామంలో ఏర్పాటయ్యే ఆలయంలో సత్యసాయి వెండి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. ట్రావెంకోర్ రాజకుటుంబం ఈ వెండి విగ్రహాన్ని బహూకరించేందుకు ముందుకు వచ్చింది. ఇక్కడి శ్రీ సత్యసాయి శరణాలయ ట్రస్ట్ ప్రతినిథి ఆనందకుమార్ బుధవారం ఈ వివరాలను వెల్లడించారు. భగవాన్ సాయిబాబా జన్మదినమైన నవంబరు 23వ తేదీన ఈ ఆలయంలో విగ్రహప్రతిష్ఠాపన జరుగుతుందని తెలిపారు.

కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి