హైదరాబాద్: అసెంబ్లీలోని గాంధీ విగ్రహం వద్ద తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్నారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టాలని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. ఈ నిరసన ప్రదర్శనలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా పాల్గొన్నారు.
8, మార్చి 2011, మంగళవారం
గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ సభ్యుల నిరసన
రెండు వికెట్లు కోల్పోయిన న్యూజిల్యాండ్
శ్రీలంక: వన్డే క్రికెట్ ప్రపంచ కప్ మ్యాచుల్లో భాగంగా గ్రూప్ 'ఎ' లోని పాకిస్థాన్, న్యూజిల్యాండ్ జట్లు ఇక్కడి పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో తలపడుతున్నాయి. టాస్ గెలిచిన న్యూజిల్యాండ్ బ్యాటింగ్ చేస్తోంది. 16 ఓవర్లు ముగిసే సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 69 పరుగులతో ఆడుతోంది.
స్కోరు:
గుప్తిల్: 45 (బ్యాటింగ్)
బ్రెండన్ మెక్లమ్: 6 (బౌల్డ్ అక్తర్)
హౌ: 4 (ఎల్బీ వుమర్ గుల్)
టేలర్ 9 (బ్యాటింగ్)
స్కోరు:
గుప్తిల్: 45 (బ్యాటింగ్)
బ్రెండన్ మెక్లమ్: 6 (బౌల్డ్ అక్తర్)
హౌ: 4 (ఎల్బీ వుమర్ గుల్)
టేలర్ 9 (బ్యాటింగ్)
మహిళాబిల్లుకు ఆమోదం లభించకపోవడం శోచనీయం: శోభానాగిరెడ్డి
హైదరాబాద్: మహిళాబిల్లుకు ఆమోదం లభించకపోవడం శోచనీయమని, చట్టసభల్లో మహిళల శాతం పెంచుకోవాల్సిన అవసరం ఉందని శోభానాగిరెడ్డి అన్నారు. మహిళా సమస్యలపై శాసనసభలో ప్రస్తావిస్తూ ఆమె, హోంమంత్రి సబితాఇంద్రారెడ్డికి స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే అవకాశం కల్పించాలని సూచించారు.
శాంతియుతంగా మిలియన్ మార్చ్: కోదండరాం
హైదరాబాద్: శాంతియుతంగా మిలియన్ మార్చ్ నిర్వహిస్తున్నందున ఎలాంటి అనుమతులు అవసరం లేదని ఐకాస కన్వీనర్ కోదండరాం అన్నారు. శాంతియుతంగా నిర్వహించే కార్యక్రమానికి ప్రభుత్వం అనవసరమైన అవాంతరాలు సృష్టించవద్దని, మిలియన్ మార్చ్ను అడ్డుకునేందుకు పోలీసులు బెదిరింపులకు దిగవద్దని ఆయన అన్నారు. మార్చి 10న సాయంత్రం 4 గంటలకు తెలంగాణ ప్రజలంతా తెలంగాణ కోసం ప్రతిజ్ఞ చేయాలని ఆయన కోరారు. సంఘటితంగా తెలంగాణ సాధించుకుంటామని ప్రతిజ్ఞచేయాలని ఆయన కోరారు. 10న విద్యార్థులంతా పరీక్షలకు తప్పనిసరిగా హాజరవ్వాలని ఆయన కోరారు.
అగ్నిప్రమాదంలో పత్తి విత్తనాలు దగ్ధం: రు. 10 కోట్లు నష్టం
ప్రకాశం: ప్రకాశం జిల్లా చీరాల మండలం జాండ్రపేటలోని బ్రహ్మసాగో ఇండస్ట్రీలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మూడు గోదాముల్లో నిలవున్న పత్తివిత్తనాలు దగ్ధమైనాయి. రు. 10 కోట్ల నష్టం వాటిల్లినట్లు యాజమాన్యం తెలిపింది. ప్రమాదానికి కారణం తెలియలేదు.
14, ఫిబ్రవరి 2011, సోమవారం
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురి దుర్మరణం
ఆదిలాబాద్(విశాల విశాఖ): ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. తాండూరు మండలం బోయపల్లి వద్ద రెండు లారీలు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మరో ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు.అదిలాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్థు చేస్తున్నారు.
అనంతపురం: జిల్లాలోని గుత్తి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. లారీ, ఆటో ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు.
అనంతపురం: జిల్లాలోని గుత్తి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. లారీ, ఆటో ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు.
గుంటూరు మిర్చియార్డులో నిలిచిన కొనుగోళ్లు
గుంటూరు(విశాల విశాఖ): గుమస్తాల ఆందోళనతో గుంటూరు మిర్చియార్డులో కొనుగోళ్లు నిలిచిపోయాయి. మిర్చియార్డులో కమిషన్ వర్తక గుమస్తాలు ఈ ఉదయం ఆందోళన చేపట్టారు. నిబంధనలను సడలించాలని డిమాండ్ చేస్తూ నరసరావుపేట రహదారిపై గుమస్తాలు బైఠాయించారు. దీంతో ఆ ప్రాంతంలో భారీగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. గుమస్తాల ఆందోళన కారణంగా కొనుగోళ్లు నిలిచిపోయాయి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)