చోడవరం(విశాల విశాఖ): చెరకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి.. క్రషింగ్కు ముందే మద్దతు ధర ప్రకటించడం ఆనవాయితీ. రైతుల తరుపున సమస్యను వివరించేందుకు వెళ్లిన ప్రజాప్రతినిధులపై తప్పుడు కేసులు బనాయించి జైళ్లకు నెట్టడంతో రైతుల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. చోడవరం చక్కెర కర్మాగార ఎండీ వైఖరి విమర్శల పాలయ్యింది. తక్షణం చెరకు మద్దతు ధర ప్రకటించడం, కేసులను ఎత్తివేయడం, ఎండీపై చర్యలు తీసుకోవడం జరగకపోతే ఆందోళన తీవ్రతరం చేయక తప్పదని టీడీపీ జిల్లా అధ్యక్షుడు అయ్యన్నపాత్రుడు కలెక్టర్కు అల్టిమేటమ్ ఇచ్చారు.మంగళవారం రాత్రి అయ్యన్న, విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, పట్టణ దేశం అధ్యక్షుడు కోన తాతారావుతోపాటు మరో పది మంది నేతలు కలెక్టర్ను బంగ్లాలో కలిసి సమస్యను వివరించారు. గత ఏడాది గోవాడ చక్కెర కర్మాగారంలో టన్నుపై రూ.2,200 చొప్పున చెల్లించారని, అప్పట్లో రైతులు కర్మాగారానికి 3,50,000 టన్నుల చెరకును సరఫరా చేశారన్నారు. ధరలు బాగుండడంతో సాగు విస్తీర్ణం పెరిగిందన్నారు. ఇప్పటికే ప్రైవేటు చక్కెర కర్మాగారాల్లో మద్దతు ధర ప్రకటించారని, అవే విధానాలను గోవాడలో ఎందుకు అవలంబించలేదని ప్రశ్నించారు.ఈఏడాది 5.5 లక్షల టన్నుల చెరకు కర్మాగారానికి వచ్చే అవకాశం ఉందని, దీంతో లాభాలు కూడా గణనీయంగా రానున్నాయని, దీనిని దృష్టిలో పెట్టుకొని రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలని కోరారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ ఎండీతో మాట్లాడి తగు చర్యలు తీసుకుంటామని నేతలకు హామీ ఇచ్చారు. మద్దతు ధర ప్రకటించే విషయంలో అన్ని కోణాల్లోనూ పరిశీలన చేయాల్సి ఉందన్నారు. ఎమ్మెల్యేలపై నమోదయిన కేసులు, అరెస్టులకు సంబంధించి జిల్లా ఎస్పీతో మాట్లాడతానన్నారు. వీలైనంతవరకూ సమస్యను సామరస్యపూర్వకంగానే పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు.ధరలు సరే... గిట్టుబాటో? : చోడవరం చక్కెర కర్మాగారంతోపాటు జిల్లాలో మిగిలిన చక్కెర కర్మాగారాలు టన్నుకు కనీసం 1600 నుంచి గరిష్టంగా 1800 చొప్పున చెల్లిస్తామంటూ చెప్పడంపై రైతులు మండిపడుతున్నారు. గత ఏడాది ఫ్యాక్టరీ యాజమాన్యాలు చూపించిన గిట్టుబాటు ధరల కారణంగానే ఈ ఏడాది సాగు విస్తీర్ణాన్ని గణనీయంగా పెంచుకున్నామని, తీరా పంట చేతికివచ్చిన తరువాత ఫ్యాక్టరీ యాజమాన్యాలు ధరపై ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నాయని రైతులు వాపోతున్నారు. ఈ ఏడాది జిల్లావ్యాప్తంగా చెరకు సాగు విస్తీర్ణం 30 శాతం మేర పెరిగింది. సాగుపై పెరిగిన పెట్టుబడులు, ఇటీవల వర్షాలకు జరిగిన నష్టాల రీత్యా గిట్టుబాటు ధర కల్పిస్తే తప్ప రైతులు బతికి బట్టకట్టలేరని చెబుతున్నారు.
గత ఏడాది చోడవరం సుగర్స్ మాత్రం గత ఏడాది 1800 రూపాయలు గిట్టుబాటుధర ప్రకటించినప్పటికీ 400 రూపాయలు బోనస్ పేరున మొత్తం 2200 రూపాయలు చొప్పున టన్ను ఒక్కంటికి చెల్లించింది. ఈ ఏడాది మాత్రం యాజమాన్యం 1800 మాత్రమే ఇస్తానని ప్రకటించింది. దీంతో రైతులు ఆందోళనకు దిగుతున్నారు. అదేవిధంగా ఏటికొప్పాక ఫ్యాక్టరీ 1800, తాండవ 1700, అనకాపల్లి 1600 రూపాయల చొప్పున గత ఏడాది ధరలే చెల్లించేందుకు సుముఖంగా ఉన్నాయి. దీంతో గిట్టుబాటు ధరపై జిల్లా చెరకు రైతుల్లో ఆసంతృప్తి చోటుచేసుకుంది. చైర్మన్గా కలెక్టర్ నిర్ణయాలపైనే సమస్య పరిష్కారం ఆధారపడి ఉంది.
గత ఏడాది చోడవరం సుగర్స్ మాత్రం గత ఏడాది 1800 రూపాయలు గిట్టుబాటుధర ప్రకటించినప్పటికీ 400 రూపాయలు బోనస్ పేరున మొత్తం 2200 రూపాయలు చొప్పున టన్ను ఒక్కంటికి చెల్లించింది. ఈ ఏడాది మాత్రం యాజమాన్యం 1800 మాత్రమే ఇస్తానని ప్రకటించింది. దీంతో రైతులు ఆందోళనకు దిగుతున్నారు. అదేవిధంగా ఏటికొప్పాక ఫ్యాక్టరీ 1800, తాండవ 1700, అనకాపల్లి 1600 రూపాయల చొప్పున గత ఏడాది ధరలే చెల్లించేందుకు సుముఖంగా ఉన్నాయి. దీంతో గిట్టుబాటు ధరపై జిల్లా చెరకు రైతుల్లో ఆసంతృప్తి చోటుచేసుకుంది. చైర్మన్గా కలెక్టర్ నిర్ణయాలపైనే సమస్య పరిష్కారం ఆధారపడి ఉంది.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి