హైాదరాబాద్: ప్రపంచదేశాలతో పోలిస్తే భారత్ బలమైన ఆర్థికశక్తిగా ఎదుగుతోందని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ ఛైర్మన్ రాకేష్మోహన్జోషి అన్నారు. హైదరాబాద్లోని ఫ్యాప్సీ హాలులో ఎగుమతులు, దిగుమతుల వ్యవహారాలు-దేశీయ వ్యాపారాలు అన్న అంశంపై జరుగుతున్న మూడురోజుల శిక్షణ తరగతులను ఆయన ఈరోజు ప్రారంభించారు. అగ్రరాజ్యం అమెరికా ఉత్పత్తి చేస్తున్న వస్తువులకు భారతే ప్రధాన మార్కెట్గా మారటం వల్ల ఒబామా మన దేశంపై ఆధారపడవలసి వస్తోందన్నారు. కేంద్రం ఈ ఆర్థిక సంవత్సరానికి 200 బిలియన్ డాలర్ల ఎగుమతులను లక్ష్యంగా పెట్టుకుందని ఆయన తెలిపారు. ఫ్యాఫ్సీ అధ్యక్షుడు శేఖర్ అగర్వాల్ కూడా ప్రసంగించారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి