పాట్నా : బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన నితీశ్కుమారు రెండోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కొత్త ప్రభుత్వం శుక్రవారం ప్రమాణస్వీకారం చేస్తుందని ముఖ్యమంత్రి నితీశ్కుమార్ బుధవారం ఇక్కడ వెల్లడించారు. ఎన్డీయే శాసనసభా పక్షం గురువారం భేటీయై సభా నాయకుణ్ని ఎన్నుకుంటుంది. అంతకుముందే జనతాదళ్(యు), భాజపా శాసనసభ సభ్యులు విడివిడిగా భేటీయై తమ తమ పక్షాల నాయకులను ఎన్నుకుంటారు. ఈ భేటీలకు భాజపా తరఫున కేంద్ర పరిశీలకులుగా అరుణ్జైట్లీ, అనంతకుమార్, ధర్మేంద్ర ప్రధాన్లు హాజరవుతారు. భాజపా నేత సుశీల్ కుమార్ మోడీనే మళ్లీ ఉపముఖ్యమంత్రిగా ఎన్నికయ్యే అవకాశాలున్నాయి.మొత్తం 243 స్థానాలు ఉన్న బీహార్ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో జేడీయూ-భాజపా కూటమి 206 చోట్ల విజయం సాధించగా, ఆర్జేడీ-ఎల్జేపీ కూటమి 25, కాంగ్రెస్ 4, ఇతరులు 8 స్థానాల్లో గెలుపొందారు.

కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి