హైదరాబాద్(విశాల విశాఖ): ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి వర్గం ఏర్పాటు కావడంతో మిగతా పదవులపై ఊహాగానాలు చెలరేగుతున్నాయి. మంత్రివర్గం ఏర్పాటు విషయంలో చివరి వరకు కిరణ్ కుమార్ రెడ్డి గోప్యతను పాటించారు. ఎవరి అంచనాలకు కూడా అది అందలేదు. మీడియా కూడా తమకు ఇష్టం వచ్చిన రీతిలో మంత్రి పదవులు దక్కే అవకాశాలున్నవారి పేర్లను ఇస్తూ వెళ్లాయి. ఇప్పుడు మిగతా పదవుల విషయంలోనూ అటువంటి ప్రచారానికే మీడియా పూనుకున్నట్లు కనిపిస్తోంది.ప్రస్తుతం చీఫ్ విప్ గా ఉన్న మల్లు భట్టి విక్రమార్కకు శాసనసభ స్పీకర్ పదవి దక్కవచ్చునని ప్రచారం జరుగుతోంది. అలాగే, నల్లగొండ జిల్లా కోదాడ శానససభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి చీఫ్ విప్ పదవి లభిస్తుందని అంటున్నారు. ప్రస్తుతం నాదెండ్ల మనోహర్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా ఉన్నారు. ఆయనను స్పీకర్ గా ఎంపిక చేయవచ్చునని ఇప్పటి వరకు వార్తలు వచ్చాయి.

కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి