హైదరాబాద్ : రాష్ట్ర శాసనసభ శీతాకాల సమావేశాలు ఈనెల 10 నుంచి ప్రారంభంకానున్నాయి. ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి శుక్రవారం రాత్రి ఈ సమావేశాల నిర్వహణకు సంబంధించి సీనియర్ మంత్రులతో చర్చించారు. సమావేశాలు డిసెంబరు 10 నుంచి 16 వరకు వారం రోజుల పాటే జరిగే అవకాశాలున్నాయి. కచ్చితంగా ఎప్పటిదాకా నిర్వహించాలనే విషయాన్ని శాసనసభా వ్యవహారాల సలహా సంఘం సమావేశంలో నిర్ణయిస్తారు. కొత్త ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో ఈ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని సిద్ధం చేయాలని సీఎం మంత్రులను కోరారు. ప్రతిపక్షం నుంచి ఎటువంటి విమర్శల దాడి వస్తుందో అంచనా వేసుకుని, దానికి తగ్గట్లుగా మంత్రులు, సీనియర్ ఎమ్మెల్యేలు తయారవ్వాలని సూచించారు. మంత్రులంతా సమష్టిగా పనిచేసి అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ వాణి వినిపించాలని కోరారు. ఏడాదిన్నరగా పెండిగులో ఉన్న కాంగ్రెస్ శాసనసభాపక్ష కార్యవర్గం నియామకాన్ని పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు. ఆయన శుక్రవారం సాయంత్రం న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డికి ఫోన్చేసి దీనిపై మాట్లాడారు. ఇప్పటికే కొంత కసరత్తు జరిగిన విషయాన్ని ఏరాసు వివరించారు. ఆ వివరాలతో తన వద్దకు వస్తే రెండు మూడురోజుల్లో నియామకం పూర్తిచేస్తామని సీఎం తెలిపారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి