ప్రముఖ వ్యాపారవేత్త, శాసనసభ సభ్యుడు విజయమాల్యాకు చెందిన యునైటె బివెరేజెస్ (యూబీ) గ్రూపుతో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేందర్ సింగ్ ధోనీ భారీ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ధోనీకు ఏడాదికి ఎనిమిది కోట్లకు పైచిలుకు చెల్లింపుతో మూడేళ్లపాటు ఈ ఒప్పందం కొనసాగనుంది.భారతదేశపు అతిపెద్ద స్పిరిట్ తయారీ సంస్థ అయిన యూబీ గ్రూపుతో ధోనీ రూ. 25.26 కోట్ల విలువు చేసే ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ఈ ఒప్పందంతో ప్రత్యక్షంగా సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులు తెలిపారు. "ఫిబ్రవరిలో క్రికెట్ వరల్డ్ కప్ ప్రారంభానికి ముందే ఈ ఒప్పందాన్ని అమలు చేయడానికి యూబీ ప్రయత్నిస్తున్నట్లు" వారిలో ఒకరు పేర్కొన్నారు.ఈ డీల్తో ప్రకటనలకు అత్యధికంగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్న బాలీవుడ్ సినీ నటులు అమీర్ ఖాన్, షారూఖ్ ఖాన్ల సరసన ధోనీ నిలువనున్నారు. ఈ ఏడాది ఆరంభంలో అమీర్ ఎటిసలాట్ టెలికాం కంపెనీతో రూ. 30 కోట్ల విలువ చేసే ఒప్పందాన్ని కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ధోనీ ఒప్పందానికి సంబంధించిన ఆర్థిక, ఇతర వివరాలు వెల్లడించడానికి మాత్రం కంపెనీ అధికారులు నిరాకరించారు.

కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి