- హైదరాబాద్ : రేపటి నుంచి ఈ నెల 16 వరకూ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. డిప్యూటీ స్పీకర్ నాదేండ్ల మనోహర్ అధ్యక్షతన శాసనసభ వ్యవహారాల సలహా సంఘం ఈ ఉదయం భేటీ అయింది. శాసనసభ శీతకాల సమావేశాల పనిదినాలను ఖరారు చేసింది. శనివారంతో కలిపి మొత్తం 6 రోజులు సమావేశాలు జరపాలని ఈ భేటీలో నిర్ణయించారు. 14 వతేదీ సాయంత్రం కూడా సభను నిర్వహించనున్నారు. తొలిరోజు సభలో ప్రశ్నోత్తరాలు లేకుండా వరదలు, పంటనష్టంపై చర్చ జరగనుంది. విద్యార్థులపై కేసులు ఎత్తివేతకు సంబంధించి సభలో ప్రభుత్వం ప్రకటన చేయనుంది.
9, డిసెంబర్ 2010, గురువారం
రేపటి నుంచి 16 వరకు అసెంబ్లీ సమావేశాలు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)

కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి