హైదరాబాద్: నిధుల లేమితో బాధ పడుతున్న విశ్వ విద్యాలయాలను విదేశాల తరహాలో దాతలు ఆదుకునే సంస్కృతి మనకు పెరగాల్సి ఉందని ఉన్నత విద్యా మండలి అధ్యక్షుడు జయప్రకాశరావు అభిప్రాయపడ్డారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం రజతోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తెలుగు విశ్వవిద్యాలయం తెలుగు వారికి గర్వకారణమని, తీవ్ర నిధుల కొరతతో బాధపడుతున్న దీన్ని రక్షించాల్సిన అవసరం ఉందని జయప్రకాశరావు అన్నారు. పూర్వ ఉపాధ్యక్షులు, రిజిస్ట్రార్లు, ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులను విశ్వవిద్యాలయం ఘనంగా సత్కరించింది. తెలుగు భాషను రక్షించుకోవాలన్న ఎన్టీఆర్ దూరదృష్టితో ప్రారంభమైన తెలుగు విశ్వవిద్యాలయాన్ని తెలుగు వారికి గర్వకారణంగా నిలుపుకోవాలని పూర్వ ఉపాధ్యక్షులు నాయని కృష్ణమూర్తి, ఎన్.గోపి, ఆవుల మంజులత అభిప్రాయపడ్డారు. తెలుగుకు విశ్వవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన ఘనత తెలుగు విశ్వవిద్యాలయానిదని పూర్వ ఉపాధ్యక్షుడు సి.నారాయణరెడ్డి అన్నారు.దాతలు ఆదుకునే సంస్కృతి పెరగాలి
హైదరాబాద్: నిధుల లేమితో బాధ పడుతున్న విశ్వ విద్యాలయాలను విదేశాల తరహాలో దాతలు ఆదుకునే సంస్కృతి మనకు పెరగాల్సి ఉందని ఉన్నత విద్యా మండలి అధ్యక్షుడు జయప్రకాశరావు అభిప్రాయపడ్డారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం రజతోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తెలుగు విశ్వవిద్యాలయం తెలుగు వారికి గర్వకారణమని, తీవ్ర నిధుల కొరతతో బాధపడుతున్న దీన్ని రక్షించాల్సిన అవసరం ఉందని జయప్రకాశరావు అన్నారు. పూర్వ ఉపాధ్యక్షులు, రిజిస్ట్రార్లు, ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులను విశ్వవిద్యాలయం ఘనంగా సత్కరించింది. తెలుగు భాషను రక్షించుకోవాలన్న ఎన్టీఆర్ దూరదృష్టితో ప్రారంభమైన తెలుగు విశ్వవిద్యాలయాన్ని తెలుగు వారికి గర్వకారణంగా నిలుపుకోవాలని పూర్వ ఉపాధ్యక్షులు నాయని కృష్ణమూర్తి, ఎన్.గోపి, ఆవుల మంజులత అభిప్రాయపడ్డారు. తెలుగుకు విశ్వవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన ఘనత తెలుగు విశ్వవిద్యాలయానిదని పూర్వ ఉపాధ్యక్షుడు సి.నారాయణరెడ్డి అన్నారు.
హైదరాబాద్: నిధుల లేమితో బాధ పడుతున్న విశ్వ విద్యాలయాలను విదేశాల తరహాలో దాతలు ఆదుకునే సంస్కృతి మనకు పెరగాల్సి ఉందని ఉన్నత విద్యా మండలి అధ్యక్షుడు జయప్రకాశరావు అభిప్రాయపడ్డారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం రజతోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తెలుగు విశ్వవిద్యాలయం తెలుగు వారికి గర్వకారణమని, తీవ్ర నిధుల కొరతతో బాధపడుతున్న దీన్ని రక్షించాల్సిన అవసరం ఉందని జయప్రకాశరావు అన్నారు. పూర్వ ఉపాధ్యక్షులు, రిజిస్ట్రార్లు, ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులను విశ్వవిద్యాలయం ఘనంగా సత్కరించింది. తెలుగు భాషను రక్షించుకోవాలన్న ఎన్టీఆర్ దూరదృష్టితో ప్రారంభమైన తెలుగు విశ్వవిద్యాలయాన్ని తెలుగు వారికి గర్వకారణంగా నిలుపుకోవాలని పూర్వ ఉపాధ్యక్షులు నాయని కృష్ణమూర్తి, ఎన్.గోపి, ఆవుల మంజులత అభిప్రాయపడ్డారు. తెలుగుకు విశ్వవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన ఘనత తెలుగు విశ్వవిద్యాలయానిదని పూర్వ ఉపాధ్యక్షుడు సి.నారాయణరెడ్డి అన్నారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి