* # మళ్లీ భేటీ అయిన బీఏసీ # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # జయపై భగ్గుమన్న కరుణానిధి # కింగ్‌ఫిషర్‌ విమాన సర్వీసుల రద్దు # సీబీఐ పిటీషన్‌ విచారణ ఎల్లుండికి వాయిదా # బాబు,కిరణ్‌ సర్కారు కుమ్మక్కు : జగన్‌ # బీజేపీ ఎమ్మెల్యేలకు ఢిల్లీ పిలుపు # మిశ్రాకు మద్దతుపై సిన్హా ఫైర్‌ # పట్టువీడని యడ్డీ # పోలీసులపై ఈసీకి నాగం ఫిర్యాదు # భవానీ హైల్యాండ్‌ ప్రైవేటు పరంపై...వాదనలు # కోనేరు బెయిల్‌ పిటీషన్‌ విచారణ వాయిదా # మంత్రి మోపిదేవిని విచారిస్తున్న సీబీఐ # భాను కోసం సీఐడీ వేట # ఏసీబీ అదుపులో మద్యంవ్యాపారి # ప్రిన్సిపాల్‌ వేధింపులతో విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం # అర్ధాంతరంగా ముగిసిన బీఏసీ భేటీ # ఏసీబీకి పట్టుబడిన గ్రామకార్యదర్శి # ఫైనల్‌ ఎంబీబీఎస్‌(పార్ట్‌-2) ఫలితాలు విడుదల # విదేశాల్లో శ్రీనివాస కల్యాణాలపై టీడీపీ ప్రణాళిక # టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌

8, డిసెంబర్ 2010, బుధవారం

నేను పైరసీ చేస్తే... పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో పెట్టారు: వర్మ

   ఫిలిమ్ ఇండస్ట్రీకి రాక ముందు తను వీడియో లైబ్రరీని నడిపేవాడిననీ, ఓ సారి "ఆఖరి రాస్తా" సినిమా పైరసీచేస్తేతనను పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారని క్రియేటివ్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ గుర్తు చేసుకున్నారు.
ఇంతకీ ఈ విషయం ఇప్పుడెందుకు ప్రస్తావించారంటే... ఆదివారంనాడు రవితేజ "మిరపకాయ్" ఆడియో ఫంక్షన్లో పైరసీ గురించి నాగబాబు మాట్లాడుతూ... విడుదలైన రోజునే పైరసీ సీడీలు వస్తున్నాయి. కోట్లు పెట్టి తీసిన నిర్మాతల నోళ్లలో మన్నుకొడుతున్నారంటూ ధ్వజమెత్తారు.సభలో ఉన్న మంత్రి టీజీ వెంకటేష్‌ను... పైరసీపై ప్రభుత్వం టాడా యాక్ట్ తేవాలని కోరారు. దీనిపై వర్మ స్పందిస్తూ... " నేను ఇండస్ట్రీకి రాక మునుపు వీడియో లైబ్రరీ నడిపేవాడిని. అప్పుడు 'ఆఖరి రాస్తా' పైరసీ చేసి పట్టుబడ్డాను. పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. అప్పుడు ఎస్ఐ ఓ మాట అన్నాడు. మీరు 100 రూపాయలకు కక్కుర్తి పడితే లక్షలు సంపాదించే వారికి ఏంటి..? ఇబ్బంది అని అన్నారు.అంటే... ఆయన ఆలోచనలో ఆయన కరెక్టే. నిర్మాతల బాధలు వారికి తెలీవు. కారుల్లో హ్యాపీగా తిరుగుతున్నారనుకుంటారు. అందుకే ఈ పైరసీ గురించి ముందుగా పోలీసులను ఎడ్యుకేట్ చేయాలి. అప్పుడే పైరసీ కంట్రోల్ అవుతుందని సూచించారు వర్మ.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి